siddharth: సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి లండన్ వెళ్లిన రకుల్!

తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలకు రకుల్ ప్రీత్ సింగ్ గట్టి పోటీ ఇస్తోంది. తెలుగులో మహేశ్ మూవీ 'స్పైడర్' .. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మూవీ 'జయ జానకి నాయక' సినిమాలను రకుల్ పూర్తి చేసింది. ఇక తమిళంలో కార్తీ సరసన 'ధీరమ్ అధిగారం ఒండ్రు' సినిమాను కూడా పూర్తి చేసింది. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 ఈ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన రకుల్ .. హిందీ మూవీ షూటింగ్ కోసం తాను లండన్ వెళుతున్నట్టుగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నీరాజ్ పాండే దర్శకత్వంలో 'అయ్యారీ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న రకుల్ అక్కడి షూటింగులో పాల్గొనడానికి వెళ్లింది. మనోజ్ బాజ్ పాయ్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.    

More Telugu News