: నెతన్యాహు కుటుంబంతో మోదీ డిన్నర్.. మూడు గంటల పాటు సాగిన కార్యక్రమం!
ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సాదరంగా ఆహ్వానించారు. తమ కుటుంబంతో కలిసి మోదీకి డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. జెరూసలెంలోని తమ అధికార నివాసం బైట్ ఆగయాన్లో ప్రధానితో కలిసి నెతన్యాహు కుటుంబం ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమం మూడు గంటల పాటు సాగింది. ఆ తర్వాత తమ గుర్తుగా నెతన్యాహు మోదీకి బహుమతిని అందించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా హైఫా ప్రాంత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న భారత అశ్వదళ చిత్రపటాన్ని నెతన్యాహు బహుమతిగా ఇచ్చారు. భోజనం పూర్తయిన తర్వాత నెతన్యాహు కుటుంబానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.