: రేపటి నుంచి 'ఒకే దేశం - ఒకే పన్ను' దేనిపై ఎంత పన్నంటే..!

రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఒకే రకమైన వస్తు సేవల పన్ను అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ అమలుతో చాలా వరకూ గృహావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజువారీ వినియోగించే నిత్యావసరాలు, వివిధ రకాల ఉత్పత్తులపై ఎంత పన్ను చెల్లించాల్సి వుంటుందో ఓసారి పరిశీలిస్తే...

0 శాతం పన్ను: తాజా కూరగాయలు, గోధుమలు, మైదా, శనగపిండి, పెరుగు, మజ్జిగ, లస్సీ, తేనె, ఉప్పు, తిలకం, కాటుక, పాలపొడి, టీ, కాఫీ, మసాలాలు, కిస్ మిస్, జీడిపప్పు, ఔషధాలు, చక్కెర, బొగ్గు,. వైద్య సేవలు, ముద్రించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు, గుడ్లు, అగర్ బత్తీలు, వంట నూనెలు, పాదరక్షలు (రూ. 500 లోపు)

12 శాతం పన్ను పరిధిలో: ఆయుర్వేద మందులు, పళ్లపొడి, వెన్న, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, సాస్, సూప్ లు, ఇన్ స్టంట్ ఫుడ్, ఐస్ క్రీమ్, హెల్మెట్లు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు (లో ఎండ్), పాల డబ్బాలు, రుమాళ్లు, నోటు పుస్తకాలు, స్టీల్ ప్రొడక్టులు, కెమెరాలు, స్పీకర్లు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, టిష్యూలు, మానిటర్లు తదితరాలు.

28 శాతం పన్ను: చూయింగ్ గమ్, చాక్లెట్లు, పాన్ మనాసాలు, పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్, పెయింట్స్, సన్ స్క్రీన్స్ వంటి సౌందర్య పోషక ఉత్పత్తులు, డిష్ వాషర్లు, వేయింగ్ మెషీన్లు, వాషింగ్ మెషీన్లు తదితరాలు.

కాగా, ఈ ఉత్పత్తుల క్వాలిటీ, బ్రాండ్ ను బట్టి తక్కువ ధరలకు లభించే వాటిపై ధరలు తగ్గనుండగా, లగ్జరీ, హై ఎండ్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.

More Telugu News