: ఈ విజయం ‘ఫాదర్స్ డే’ సందర్భంగా నాకు ఇచ్చిన కానుక: కిదాంబి శ్రీకాంత్ తండ్రి

ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా అతని తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తో వారు మాట్లాడుతూ, ‘చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఫాదర్స్ డే. ఈ విజయాన్ని నాకు కానుకగా ఇచ్చాడు. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్ తర్వాత రెండు సూపర్ సిరీస్   ఆడాడు. అయితే, గాయాల కారణంగా నాలుగు నెలల పాటు  షటిల్ కు దూరంగా ఉన్నాడు. మళ్లీ, మొన్న జనవరి నుంచి ప్రాక్టీస్ చేశాడు. మా అబ్బాయి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం వాళ్ల సార్ గోపీచంద్ గారే. అలానే, మా అబ్బాయికి పట్టుదల ఉంది, పద్ధతిగా ఉంటాడు. మొన్న గాయాల పాలైన తర్వాత కూడా శ్రీకాంత్ కుంగిపోకుండా ఈ సిరీస్ లో విజేతగా నిలవడానికి కారణం గోపీచంద్ గారు ఇచ్చిన ధైర్యమే’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News