: అమెరికా యుద్ధ నౌకను ఢీ కొట్టిన కార్గో నౌక... పలువురికి గాయాలు!

ఉత్తరకొరియాతో నెలకొన్న వైరం నేపథ్యంలో జపాన్ సముద్ర జలాల్లో అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు గస్తీ కాస్తున్నాయి. ఈ క్రమంలో జపాన్ లోని యోకుసుఖాకు 56 నాటికల్ మైళ్ల దూరంలో వేకువ జాము 3 గంటల సమయంలో ఫిలిప్పీన్స్ జెండా కలిగిన ఏసీఎక్స్ క్రిస్టల్ అనే కార్గో (సరకు రవాణా) నౌక ఒకటి అమెరికా నావికాదళానికి చెందిన పిట్జరాల్డ్ అనే క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు నౌకల్లోని సిబ్బంది గాయపడ్డారని సమాచారం. యుద్ధనౌకకు చిల్లుపడి నీరు లోపలికి వస్తోందని, దానిని నేవీ సిబ్బంది నియంత్రించినట్టు తెలుస్తోంది. కార్గో నౌక నేవి షిప్ ను ఢీ కొట్టిన సమయంలో అందులో 330 మంది సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.

More Telugu News