: ఎల్లుండి జరగనున్న మ్యాచ్ లో భారత్‌ను ఓడిస్తాం: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్

ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ -ఏ నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ గ్రూప్-బీ లో అగ్ర‌స్థానంలో ఉన్న టీమిండియాతో ఎల్లుండి త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ గాజి అష్రఫ్ మాట్లాడుతూ.. తాము ఆ  మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్‌కు వెళ‌తామ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. టీమిండియా లాంటి బలమైన జట్టుపై విజ‌యం సాధించేందుకు త‌మ జ‌ట్టు ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయ‌న సూచించాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీని చేజిక్కించుకోవ‌డానికి ఇది ఉత్తమ అవకాశమని ఆయ‌న అన్నాడు.         

More Telugu News