: ఛాంపియన్స్ ట్రోఫీ: మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక... దినేష్ డకౌట్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు శ్రీలంక-పాకిస్థాన్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీలంక ఓపెనర్ గుణ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన మెండిస్ కూడా 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన దినేష్ ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యాడు. మరో ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా మాత్రం చక్కగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం క్రీజులో నిరోషన్ డిక్వెల్లా 51, మాథ్యూస్ 6 పరుగులతో ఉన్నారు. శ్రీలంక స్కోరు 100/3 (20 ఓవర్లకి) గా ఉంది.