: సొంత మైదానంలో చివరి పోటీలో విజయం సాధించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్

సొంత మైదానంలో జరిగిన చివరి పోరులో జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ విజయం సాధించాడు. ఆగస్టులో లండన్ లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల అనంతరం పరుగు ఆపేద్దామని, పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బోల్డ్...స్వదేశంలో సొంత అభిమానుల ముందు చివరి పోటీల్లో పాల్గొన్నాడు. బోల్ట్ వేగాన్ని చివరి సారి చూసేందుకు భారీ సంఖ్యలో జమైకన్లు మైదానానికి తరలివచ్చారు.

ఈ క్రమంలో 10.03 సెకెన్లలో 100 మీటర్ల దూరాన్ని అధిగమించి, విజయంతో సొంత అభిమానులకు అభివాదం చేశాడు. ఇంత కాలం తనను ఆదిరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు. తన తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రాణ స్నేహితుడు ఎన్‌జే, జమైకా అభిమానులు లేకుండా కెరీర్ లో ఇన్ని సాధించేవాడిని కాదని చెప్పాడు. తనకు ఇంత కాలం అండగా నిలిచిన జమైకాకు అభివాదం చేస్తున్నానని బోల్ట్ ఉద్వేగంతో తెలిపాడు. తరువాత ‘థ్యాంక్యూ జమైకా’ అని ట్వీట్ చేశాడు.

More Telugu News