: బ్రిటన్ లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన సిక్కు మహిళ

బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సిక్కుమహిళ ప్రీతి కౌర్ గిల్ విజయం సాధించింది. లేబర్ పార్టీ తరపున బర్మింగ్ హోమ్ ఎడ్గ్ బస్టన్ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రీతి కౌర్ గిల్  గెలుపొందారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రత్యర్థి కార్లోన్ స్క్వైర్ పై 6917 ఓట్ల మెజారిటీ తో కౌర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను ఎంపీగా ఎన్నుకున్న ఎడ్గ్ బస్టన్ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి కోసం పాటుపడతానని చెప్పారు.  

More Telugu News