: సెంచరీతో అదరగొట్టిన శిఖర్ ధావన్!

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జ‌రుగుతున్న‌ టీమిండియా, శ్రీ‌లంక మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అద‌ర‌గొట్టేశాడు. ఓ వైపు కోహ్లీ ప‌రుగులేమీ చేయ‌కుండా, మ‌రోవైపు యువ‌రాజ్ సింగ్ 7 ప‌రుగుల‌కే వెనుదిరిగిన వేళ ధావ‌న్ మాత్రం చూడ‌చ‌క్క‌ని షాట్‌ల‌తో స్కోరు బోర్డుని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. 112 బంతుల్లో సెంచ‌రీ బాదాడు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు మూడు వికెట్ల న‌ష్టానికి 217గా ఉంది. క్రీజులో ధోనీ 20, ధావ‌న్ 102 ప‌రుగులతో ఉన్నారు. 

More Telugu News