: పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలను తెంచుకున్న మరో దేశం!

పాకిస్థాన్ కు పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ షాక్ ఇచ్చింది. తమ రాజధాని కాబూల్ లో నిన్న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ తో ఆడాలనుకున్న స్నేహపూర్వక మ్యాచ్ లను రద్దు చేస్తున్నామని... దీంతోపాటు, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందాల నుంచి బయటకు వస్తున్నామని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాబూల్ లోని ఇండియన్ ఎంబసీకి సమీపంలో నిన్న జరిగిన ఉగ్ర దాడిలో 90 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. పాక్ లోని హక్కానీ నెట్ వర్క్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఈ దారుణానికి పాల్పడిందని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ సెక్యూరిటీ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ క్రికెట్ బోర్డు పాక్ తో క్రికెట్ సంబంధాలను తెంచుకుంది.

More Telugu News