: ఈ నరేంద్ర మోదీ ఎవరు? మన దేశంలో ఇంత గౌరవమేంటి?: అమాయకంగా అడుగుతున్న స్పెయిన్ వాసులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, తన నాలుగు దేశాల పర్యటనలో భాగంగా నిన్న స్పెయిన్ కు వెళ్లిన వేళ, మోదీ రాక గురించి, అన్ని పత్రికలూ పతాక శీర్షికన వార్తలు ఇస్తే, స్పెయిన్ వాసులు మాత్రం అత్యంత అమాయకంగా, ఈ నరేంద్ర మోదీ ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. 1988లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో స్పెయిన్ లో అధికారికంగా పర్యటించగా, ఆ తరువాత స్పెయిన్ ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే.

కాగా, స్పెయిన్ వాసులను భారత నేత గురించి అడుగుతూ తీసిన ఓ వీడియోలో పలువురు ఆయన్ను గుర్తించినప్పటికీ, మన దేశంలో ఇంత గౌరవాన్ని పొందుతున్న ఆయనెవరని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. ఇంకో వ్యక్తి అయితే, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయనేనని చెప్పడం గమనార్హం. ఓ యువతి ఆయన్ను తాను ఇష్టపడుతున్నానని చెప్పగా, మరో వ్యక్తి ఆయనే 'యోగా డే'ని ప్రారంభించారని కూడా చెప్పారు.

More Telugu News