: ఉత్తర కొరియాకు షాక్... కదిలిన యూఎస్ రెండో వార్ షిప్!

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, కిమ్ జాంగ్ ఉన్ కు షాకిచ్చేలా, యూఎస్ వార్ షిప్ లలో అత్యంత కీలకమైన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ ను కూడా ఉత్తర కొరియా సముద్ర జలాల్లోకి అమెరికా పంపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ కార్ల్ విల్సన్ దక్షిణ కొరియాకు దగ్గరగా ఉండగా, ఇప్పుడు దానికి తోడుగా మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. ఈ రెండూ కలసి యుద్ధ విన్యాసాలు చేయనున్నాయని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

గత నెల 5వ తేదీన బాలిస్టిక్ అణు క్షిపణిని పరీక్షించడం, ఆపై అమెరికాను రెచ్చగొడుతూ దాడి చేస్తామని హెచ్చరించడం, తాజాగా ఉత్తర కొరియా వైపు దూసుకొస్తున్న యుద్ధనౌకలు... ఈ పరిణామాలు చూస్తుంటే, యుద్ధం అనివార్యమని అనిపిస్తున్నట్టు నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, చాలా కాలంగా యూఎస్ఎస్ కార్ల్ విల్సన్ ఒక్కటే సముద్ర జలాల్లో ఉన్నందున దానికి తోడుగా బాధ్యతలు నిర్వహించేందుకు యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ ను పంపినట్టు రక్షణ శాఖ అధికారి చార్లెస్ విలియమ్స్ వెల్లడించారు.

More Telugu News