: తాజా విజయంతో టాప్ లో నిలిచిన ముంబై ఇండియన్స్

నిన్న రాత్రి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నైట్ రైడర్స్ జట్టుపై స్ఫూర్తిమంతమైన విజయాన్ని సాధించిన ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా, కోల్ కతా జట్టు 164 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మెరుగైన రన్ రేటున్న కారణంగా కోల్ కతా జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది.ముంబై జట్టులో సౌరభ్ తివారీ 52, రాయుడు 63 పరుగులతో రాణించగా, కోల్ కతా జట్టులో లిన్ 26, గంభీర్ 21, మనీష్ పాండే 33, యూసుఫ్ పఠాన్ 20, గ్రాండ్ హోమ్ 29 పరుగులు చేశారు. ఏ ఆటగాడు కూడా మంచి స్కోరును సాధించడంలో విఫలమైనందునే తాము మ్యాచ్ గెలవలేక పోయామని మ్యాచ్ అనంతరం గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇక ప్లే ఆఫ్ పోటీల్లో సత్తా చాటుతామని తెలిపాడు.

More Telugu News