: జపాన్ లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6గా నమోదు

జపాన్‌ లో భారీ భూకంపం సంభవించింది.మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 6 గా నమోదైంది. దీనిని అమెరికా భూభౌతిక పరిశోధనా కేంద్రం కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, సముద్రంలో భూకంపం రావడంతో సముద్ర మట్టాల్లో తేడాలు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సునామీ వచ్చే అవకాశం లేదని వారు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉన్న నాలుగు టెక్టానిక్‌ ప్లేట్లలో వచ్చే కదిలికల వల్ల ప్రతిఏటా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఈ భూకంపం కారణంగా వచ్చిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News