: పాక్ యువకుడిని పెళ్లి చేసుకున్న ఢిల్లీ అమ్మాయి... ఇప్పుడు ఇస్లామాబాద్ దౌత్య కార్యాలయంలో బందీ!

తనను వివాహం చేసుకున్న ఢిల్లీ యువతిని ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయంలో బందీగా ఉంచారని, ఆమెను వెంటనే విడిపించాలని ఓ పాకిస్థానీ యువకుడు డిమాండ్ చేశాడు. పాక్ మీడియా వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన ఉజ్మా అనే యువతి మలేషియాలో ఉన్న వేళ, తాహిర్ అనే యువకుడు పరిచయం కాగా, ప్రేమించుకుని ఈ నెల 3న వివాహం చేసుకున్నారు.

ఆపై ఉజ్మాకు వీసా కోసం ఇస్లామాబాద్ లోని హై కమిషన్ భవనానికి వెళ్లి, వీసా పత్రాలను సమర్పించగా, అధికారుల ఆదేశంతో లోనికి వెళ్లిన ఉజ్మా ఇక బయటకు రాలేదు. ఆమెను కార్యాలయంలోనే భారత అధికారులు బంధించారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా వెల్లడించారు. కాగా, ఈ విషయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ఆమె హై కమిషన్ సహయాన్ని కోరిందని, ఓ కౌన్సిలర్ ఆమెకు సాయపడుతున్నాడని పేర్కొనడం గమనార్హం.

More Telugu News