: 48 గంటల్లో టీమ్ ఎంపిక... చాంపియన్స్ ట్రోఫీ ఆడతామన్న బీసీసీఐ

జూన్ 1 నుంచి లండన్ లో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందని, జట్టు ఎంపికను 48 గంటల్లో పూర్తి చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ఉదయం సమావేశమై, ఐసీసీతో రెవెన్యూ షేరింగ్ మోడల్ సహా పలు అంశాలను చర్చించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపాలని తీర్మానించారు. రెండు రోజుల్లో జట్టు ఎంపికను పూర్తి చేస్తామని తెలిపింది. కాగా, కొత్త ఆదాయ పంపిణీ విధానంతో బీసీసీఐ ఆదాయం 570 మిలియన్ డాలర్ల నుంచి 293 మిలియన్ డాలర్లకు తగ్గిపోనుండగా, దీనిపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీసీసీఐ, ట్రోఫీ నుంచి విరమించుకునే ఆలోచన చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News