: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు మూడో స్థానం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా మళ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో, భారత క్రికెట్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. అయితే, 2019 ప్రపంచకప్ లోకి నేరుగా ఎంట్రీ కావాలంటే ఉండాల్సిన 8వ స్థానాన్ని మాత్రం పాకిస్థాన్ కైవసం చేసుకుంది.2017 సెప్టెంబర్ 30 నాటికి ఇంగ్లండ్ తో పాటు టాప్ 7 ర్యాంకుల్లో ఉన్న జట్లు 2019 ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధిస్తాయి.ఈసారి ప్రపంచకప్ ఇంగ్లండ్ లో జరుగుతుండటంతో ఆ జట్టుకు అర్హత దానంతట అదే వస్తుంది. 2016 మే 1వ తేదీ తర్వాత ఆడిన మ్యాచ్ లను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ తాజా ర్యాంకులను నిర్ణయించింది.  
 
ఐసీసీ వన్డే ర్యాంకుల వివరాలు..

* దక్షిణాఫ్రికా -123 పాయింట్స్ (+ 4 పాయింట్స్)
* ఆస్ట్రేలియా -118 పాయింట్స్
* ఇండియా -117 పాయింట్స్ (+5 పాయింట్స్)
* న్యూజిలాండ్ - 115 పాయింట్స్ (+2 పాయింట్స్)
* ఇంగ్లాండ్ -109 పాయింట్స్ (+1 పాయింట్)
* శ్రీలంక -93 పాయింట్స్ (-5 పాయింట్స్)
* బంగ్లాదేశ్ -91 పాయింట్స్ (-1 పాయింట్)
* పాకిస్థాన్ -88 పాయింట్స్ (-2 పాయింట్స్)
* వెస్ట్ ఇండీస్ -79 పాయింట్స్ (-4 పాయింట్స్)
* ఆఫ్ఘనిస్థాన్ -52 పాయింట్స్
* జింబాబ్వే - 46 పాయింట్స్ (-2 పాయింట్స్)
*ఐర్లాండ్ - 43 పాయింట్స్ (+1 పాయింట్)

More Telugu News