: అద్వాని పాత్ర లేదు.. రెచ్చగొట్టింది నేను.. నన్ను ఉరి తీయండి: మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంతి సంచలన వ్యాఖ్యలు

బాబ్రీ మసీదును కూల్చిన కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎల్కే అద్వానీ పాత్ర లేదని, ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను ఉరి తీయించుకునేందుకు సిద్ధమ‌ని అన్నారు. ఆ రోజు మ‌సీదు కూల్చివేత జరుగుతున్నప్పుడు తాను వీహెచ్‌పీ నేత అశోక్‌ సింఘాల్‌, మహంత్‌ అవైద్యనాథ్‌తో ఉన్నానని, తాను మరికొందరితో కలిసి కరసేవకులను రెచ్చగొట్టామ‌ని, మ‌రోవైపు జోషీ, అద్వానీ, విజయ్‌ రాజే సింధియా మాత్రం ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న అన్నారు.
 
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిల‌ను చేర్చాల్సిందేన‌ని సుప్రీంకోర్టు సీబీఐకి కీల‌క ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో రామ్‌ విలాస్‌ వేదాంతి ఇటువంటి వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News