: ఉత్తమ్ పని తీరుపై హై కమాండ్ సంతృప్తిగా ఉంది: దిగ్విజయ్ సింగ్

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పని తీరుపై హై కమాండ్ సంతృప్తిగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్  దిగ్విజయ్ సింగ్ అన్నారు. హైదరాబాదు గాంధీభవన్ లో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్, మోదీ మధ్య రహస్య స్నేహం ఉందని, రిజర్వేషన్ల పేరుతో ఇరు వర్గాలను రెచ్చగొట్టి.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్, కాంగ్రెస్ గలీజ్ పార్టీ ఎలా అయిందో చెప్పాలని, టీఆర్ఎస్ ఏ రకమైన పార్టీ? అని దిగ్విజయ్ ప్రశ్నించారు.

More Telugu News