: సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు: సీఎం చంద్రబాబు

సోషల్‌ మీడియాలో పెరిగిపోతున్న అభ్యంత‌ర‌క‌ర పోస్టులు, అస‌త్య ప్ర‌చారాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అసహ‌నం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ... సామాజిక మాధ్య‌మాల‌ను ఎంతో మంది దుర్వినియోగం చేస్తున్నారని, అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాటిల్లో కొంద‌రు ఏదైనా రాయొచ్చని అనుకుంటున్నారని, దేనికైనా ఒక పద్ధతి ఉండాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

More Telugu News