: ఆర్బీఐ నిర్ణయంతో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

రెపో రేట్లను 6.25 శాతం వద్దే స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 47 పాయింట్లు కోల్పోయి 29,927 వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 9,261 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
నవకార్ కార్పొరేషన్ లిమిటెడ్ (15.07%), మెక్ లియోడ్ రస్సెల్ (7.44%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (6.76%), అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (6.29%), అదానీ పవర్ లిమిటెడ్ (5.23%).

టాప్ లూజర్స్...
డెల్టా కార్ప్ లిమిటెడ్ (-8.71%), జస్ట్ డయల్ (-3.89%), ముత్తూట్ ఫైనాన్స్ (-3.80%), కార్పొరేషన్ బ్యాంక్ (-3.72%), గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (-3.45%)    

More Telugu News