: హమ్మయ్య... ఆస్ట్రేలియాపై లీడింగ్ లోకి టీమిండియా... జడేజా హాఫ్ సెంచరీ

ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టు, మూడో రోజున ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ ఉదయం భారత బ్యాటింగ్ ను కొనసాగించిన వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజాలు నిదానంగా ఆడుతూ, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 300ను దాటించారు. ఈ క్రమంలో జడేజా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 83 బంతులాడిన జడేజా, 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 50 పరుగులు చేశాడు. జడేజాకు ఇది ఏడో టెస్టు హాఫ్ సెంచరీ కాగా, ఈ సిరీస్ లో రెండొవది. ప్రస్తుతం భారత స్కోరు 109 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు కాగా, సాహా 91 బంతుల్లో 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

More Telugu News