: 100 మార్కును దాటిన ఆసీస్ స్కోరు

రాంచీ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య‌ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన మార్ష్‌, హెచ్.కాంబ్ లు ఆచితూచి ఆడుతూ వికెట్‌ను కాపాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం మార్ష్ 27, కాంబ్ 12 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో రెండో ఇన్నింగ్స్ లో వార్న‌ర్ 14, రెన్షా 15, లియాన్ 2, స్మిత్ 21 ప‌రుగులు చేశారు. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌డేజాకి మూడు వికెట్లు దక్కగా, ఇషాంత్ ఒక్క వికెట్ తీశాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియా 152 పరుగుల ఆధిక్యం సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆసీస్ స్కోరు 107/4 గా ఉంది.

More Telugu News