: అసెంబ్లీలో అమితానందంగా కనిపించిన చంద్రబాబు

ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత సీఎం చంద్రబాబునాయుడి ముఖంలో స్థానిక సంస్థల ఎన్నికల విజయానందం స్పష్టంగా కనిపించింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, తన ప్రసంగమంతా నవ్వుతూనే కొనసాగించారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని, ఇకపై మరింత కష్టపడి పనిచేసి తెలుగు జాతి సత్తాను చాటుతామని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తాను ఈ మాటలు చెబుతున్నానని, తన మాటలకు తిరుగులేదని అన్నారు. తాత్కాలిక అసెంబ్లీనే ఇంత బాగుంటే, అసలు అసెంబ్లీ ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వైకాపా సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయబోగా, సభలో హుందాగా ప్రవర్తించాలని, లేకుంటే ఇవే ఫలితాలు పదే పదే పునరావృతమవుతాయని హితవు పలికారు.

More Telugu News