: ఇకపై జీ మెయిల్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు!

ఇకపై మరో కొత్త మనీ ట్రాన్స్ పర్ విధానం అందుబాటులోకి రానుంది. ప్రముఖ సర్చింజిన్ ‘గూగుల్’ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వారా వినియోగదారులు జీ మెయిల్ ఐడీ కలిగి ఉంటే, దాని ద్వారా డబ్బులు పంపించుకునేందుకు లేదా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, జీ మెయిల్ యాప్ ను ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ పద్ధతి అందుబాటులో ఉంటుంది.

జీ మెయిల్ లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్ లో అవతలి వ్యక్తి మెయిల్ ఐడీ, ఎంత మొత్తం డబ్బు పంపుతున్నామనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. దీంతో, అవతలి వ్యక్తికి మెయిల్ ద్వారా అందిన డబ్బును, బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీ మెయిల్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త మనీ ట్రాన్స్ ఫర్ విధానానికి ఎలాంటి ఫీజును యూజర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా, మనీ ట్రాన్స్ ఫర్ కు ఐఎంపీఎస్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఆధార్ పే వంటి వివిధ మార్గాలను వినియోగదారులు ప్రస్తుతం అనుసరిస్తున్నారు.  

More Telugu News