: యూట్యూబ్‌లోనూ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్.. పదివేల మంది ఫాలోవర్లు ఉంటేనే సుమా!

యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వారికి శుభవార్త. ఫేస్‌బుక్, ట్విట్టర్ మాదిరిగానే యూట్యూబ్‌లోనూ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. పదివేల మంది ఫాలోవర్లు ఉన్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంస్థ అధికారులు పేర్కొన్నారు. యూట్యూబ్ మొబైల్  యాప్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. మామూలుగా అప్‌లోడ్ చేసే వీడియోకు ఉన్నట్టే దీనికి కూడా ఆప్షన్లు ఉంటాయని వారు పేర్కొన్నారు. అంతేకాక ‘మానిటైజేషన్’ టూల్ ‘సూపర్ చాట్’ ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని సదరు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

More Telugu News