google: ఇకపై బడ్జెట్ ధరకు గూగుల్‌ నుంచి స్మార్ట్ ఫోన్‌

గూగుల్ సంస్థ‌ కొత్తగా తీసుకొచ్చిన‌ ‘పిక్సెల్‌’ సిరీస్‌ ఫోన్లు సామాన్యుడికి అందుబాటులో లేని విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే హై-ఎండ్‌ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన ఆ ఫోన్ల ధర రూ.57వేలకు పైనే ఉంది. బడ్జెట్‌ ఫోన్లకు మార్కెట్‌లో ఉన్న‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గూగుల్ త‌క్కువ ధ‌ర‌ల‌కు స్మార్ట్‌ఫోన్‌ల‌కు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే పిక్సెల్‌ పీ2, పిక్సెల్‌ పీబీ పేర్లతో రెండు మోడళ్లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది.

‘పిక్సెల్‌ పీ2’ ధర ఇప్పుడున్న పిక్సెల్‌ ఫోన్లకంటే అధికంగా ఉంటుండ‌గా, ‘పిక్సెల్‌ పీబీ’ ధర మాత్రం రూ.13,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మ‌రోవైపు పిక్సెల్‌ పీ2లో వాటర్‌ ప్రూఫ్ ఫీచ‌ర్ కూడా ఉండ‌నుంది. అంతేగాక‌, ర్యామ్‌ సామర్థ్యంతో, డిస్‌ప్లే రిజల్యూషన్‌ కూడా అధికంగా ఉండేందుకు గూగుల్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది.

More Telugu News