sushma swaraj: మరోసారి సేవాగుణాన్ని చాటుకున్న సుష్మాస్వ‌రాజ్‌

గుండె సంబంధిత సమస్యతో జన్మించిన పసికందుకు సాయం చేయడానికి భార‌త‌ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌
ముందుకొచ్చారు. ఆ చిన్నారి స‌మ‌స్య ఆమె దృష్టికి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆ ప‌సికందుకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. వివ‌రాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దేవేశ్‌ శర్మ, వందన శర్మ దంప‌తుల‌కు నాలుగు రోజుల క్రితం ఓ బాబు జన్మించాడు. అయితే, ఆ శిశువుకి గుండెకు సంబంధించిన సమస్య ఉండడంతో భోపాల్‌లో ఆ బాలుడికి శ‌స్త్ర‌చికిత్స చేసేందుకు సరైన సదుపాయాలు లేవని, దేవేశ్‌ ట్విటర్ ద్వారా సుష్మాస్వరాజ్‌కు తెలిపారు.
 
దీంతో స్పందించిన సుష్మ ఆ శిశువు తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంత‌రం భోపాల్‌లోని తన ఆఫీసు సిబ్బంది ద్వారా మెడికల్‌ రిపోర్ట్స్‌ తెప్పించుకుని ఆ శిశువును ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. ఆ చిన్నారికి వెంట‌నే ఆప‌రేష‌న్ చేస్తామ‌ని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

More Telugu News