special status: రెండేళ్లలో సీఎం అవుతా.. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా.. అందరి పనీ చెబుతా!: ఎయిర్ పోర్టులో పోలీసులకు జగన్ హెచ్చరిక

ప్ర‌త్యేక హోదా కోసం విశాఖప‌ట్నంలో యువత నిర్వ‌హించత‌ల‌పెట్టిన శాంతియుత నిర‌స‌న‌లో పాల్గొనడానికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకి చేరుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బృందాన్ని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆయ‌న అక్క‌డే బైఠాయించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇంకా అక్క‌డే ఉన్నారు. ఆయ‌న‌తో పాటు విజ‌య‌సాయిరెడ్డి, అంబ‌టి రాంబాబుతో పాటు ప‌లువురు ఉన్నారు. అయితే, పోలీసులు త‌మ‌ను అడ్డుకున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ వారితో మాట్లాడుతూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విమానంలో ఓ ప్రయాణికుడిగా వచ్చిన తన‌ను ఎందుకు ఆపుతున్నారని ఆయ‌న అధికారుల‌ను ప్ర‌శ్నించారు. తాను రెండేళ్లలో సీఎం అవుతాన‌ని, తమను అడ్డుకుంటున్న వారి పేర్లను గుర్తుపెట్టుకుంటాన‌ని, అందరి పనీ చెబుతాన‌ని వ్యాఖ్యానించారు. వారిలో ఎవ్వరినీ వదిలిపెట్టబోన‌ని అన్నారు.

More Telugu News