goutami putra satha karni: 79 రోజుల్లో శాత‌క‌ర్ణి ఎలా తీశావ‌ని రాజ‌మౌళి అడిగారు.. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప‌ ఎందుకు చంపాడో చెప్పండి, చెబుతా అన్నా!: క‌్రిష్

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రాన్ని కేవ‌లం 79 రోజుల్లో తీసి, అంద‌రి నుంచీ ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌శంస‌లు అందుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా ఎంత‌గానో అభినందించారు. ఈ రోజు ద‌ర్శ‌కుడు క్రిష్‌ ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ... ఈ సినిమా విడుద‌లైన అనంత‌రం త‌నతో రాజ‌మౌళి మాట్లాడుతూ 79 రోజుల్లో శాత‌క‌ర్ణిని ఎలా తీశావ‌ని అడిగారని, దానికి నేను ‘బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప‌ ఎందుకు చంపాడో చెప్పండి? చెబుతా’ అని స‌ర‌దాగా అన్నాన‌ని చెప్పారు. అంద‌రూ త‌న‌ని ఈ విష‌య‌మే అడుగుతున్నార‌ని క్రిష్ అన్నారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ఎడిట‌ర్ అద్భుతంగా తన పనితనాన్ని ప్రదర్శించారని అభినందించారు. ఈ సినిమాను తెరకెక్కించిన తీరు పట్ల నంద‌మూరి బాల‌కృష్ణ కూడా త‌న‌ను ఎంత‌గానో అభినందించార‌ని క్రిష్ అన్నారు.

More Telugu News