: వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 107 పాయింట్లు అప్!

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి.  మాక్రో ఎకనామిక్ డేటా విడుదల అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో, సెన్సెక్స్ 107 పాయింట్లు లాభపడి 27,247కి చేరింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 8,407కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
ఎన్ హెచ్ పీ సీ (9.12%), ఎన్ఎల్సీ ఇండియా (8.93%), ఎస్ జేవీఎన్ (7.49%), ఏఐఏ ఇంజినీరింగ్ (6.67%), టాటా కమ్యూనికేషన్స్ (6.05%).    

టాప్ లూజర్స్...
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (-3.81%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (-3.80%), ఐడియా సెల్యులార్ (-3.22%), పీవీఆర్ లిమిటెడ్ (-3.04%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-2.95%).      

More Telugu News