firing: తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైనికుడు.. నలుగురు జవాన్ల మృతి

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. కోపోద్రిక్తుడయిన సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ జవాన్ త‌న స‌హ‌చ‌ర జ‌వాన్ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌పాల‌యిన వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి తీసుకెళుతున్న‌ట్లు తెలుస్తోంది. స‌ద‌రు జ‌వాను ఈ కాల్పుల‌కు ఎందుకు పాల్ప‌డ్డాడ‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News