panner selvam: విజయవాడలో పన్నీర్ సెల్వం... కాసేపట్లో చంద్రబాబుతో భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో సమావేశం అయేందుకు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. తెలుగుగంగ పథకం కింద చెన్నైకు నీరు వ‌ద‌లాల‌ని, ఆ జ‌లాలను కండలేరు జలాశయానికి విడుదల చేయాలని ప‌న్నీర్ సెల్వం చంద్ర‌బాబును కోర‌నున్న‌ట్లు తెలుస్తోంది. చెన్నై తాగునీటి అవసరాలకు గానూ కృష్ణా జలాలను విడుదల చేయాలని చంద్ర‌బాబుకి ఆయ‌న ఇటీవ‌లే ఓ లేఖ కూడా రాసిన విష‌యం తెలిసిందే.

More Telugu News