: కోహ్లీ కెప్టెన్సీపై ఆందోళన వ్యక్తం చేసిన అశ్విన్

లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో... అన్ని ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. ఈ సందర్భంగా, కోహ్లీ కెప్టెన్సీపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ధోనీ కెప్టెన్సీలో లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఇంతకాలం చాలా కూల్ గా సాగిందని... కోహ్లీ ఎంతమేర కూల్ గా వ్యవహరిస్తాడో అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటాడని... కూల్ గా వ్యవహరించడానికి అతనికి ఎంత సమయం పడుతుందో అని అన్నాడు. కఠిన సమయాల్లో సైతం ఎంతో సమస్ఫూర్తితో ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో ధోన్ స్పిన్నర్లను దింపి, రన్స్ ను కంట్రోల్ చేస్తాడని... కోహ్లీ మాత్రం ఈ ఓవర్లలోనూ అటాకింగ్ గేమ్ ప్లాన్ చేస్తాడని, వికెట్లు పడగొట్టడంపైనే దృష్టి సారిస్తాడని అన్నాడు. ఇది కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పాడు.

More Telugu News