panner selvam: రేపు అమరావతికి పన్నీర్ సెల్వం.... చంద్రబాబుతో భేటీ కానున్న తమిళనాడు సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజ‌ధాని అమ‌రావ‌తికి రానున్నారు. అక్క‌డి నూత‌న సచివాల‌య ప్రాంగ‌ణంలో ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్ర‌ధానంగా చెన్నై తాగునీటి అవసరాలకు గానూ కృష్ణా జలాలను విడుదల చేయాలని చంద్ర‌బాబుని కోర‌నున్నారు. ఇదే అంశంపై చంద్ర‌బాబుకి ఇటీవ‌లే ప‌న్నీర్ సెల్వం ఓ లేఖ కూడా రాసిన విష‌యం తెలిసిందే. తెలుగుగంగ పథకం కింద ఈ నీరు వ‌ద‌లాల‌ని, ఆ జ‌లాలను కండలేరు జలాశయానికి విడుదల చేయాలని ప‌న్నీర్ సెల్వం కోరారు.

More Telugu News