mayavathi: యూపీ ఎన్నికలకు బీఎస్పీ తొలిజాబితా విడుదల... ముజఫర్‌నగర్‌ అల్లర్ల నిందితుడికి టికెట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో నెల రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తమ తొలి జాబితాను విడుద‌ల చేశారు. ఆ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో 100 మందితో కూడిన తొలి జాబితాను ఆమె ప్ర‌క‌టించారు. వారిలో 36 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసులో నిందితుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే నూర్‌ సాలెం రాణా పేరు సైతం ఉంది. త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దింప‌నున్న వారి పేర్ల‌ను వెల్ల‌డిస్తూ కొన్ని రోజుల క్రితం ఆమె ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అందులో ముస్లింలకు 97, అగ్రవర్ణాలకు 113, ఓబీసీలకు 106, దళితులకు 87 స్థానాలు కేటాయించనున్నామ‌ని, ఇత‌ర ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోవ‌డం లేదని తెలిపారు.

More Telugu News