bengaluru: బెంగళూరులో నడిరోడ్డుపై అమ్మాయిలను వేధించిన కామాంధులను ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా బెంగ‌ళూరులో యువ‌తుల‌తో న‌డిరోడ్డుపై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి క‌ల‌క‌లం రేపిన యువ‌కులు ఈ రోజు పోలీసుల చేతికి చిక్కారు. సీసీ కెమెరాల ఆధారంగా బెంగళూరులోని ప‌లు ప్రాంతాల్లో ఈ కామాంధుల గురించి సెర్చ్ చేసిన పోలీసులు మొత్తం 12 మంది నిందితుల‌ని అదుపులోకి తీసుకున్నారు. తాము అమ్మాయిల‌ను వేధించిన‌ట్లు వారు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. బాన‌స‌వాడి పోలీస్‌స్టేష‌న్‌లో పోలీసులు నిందితుల‌ను విచారిస్తున్నారు. మరోవైపు ఈ కామాంధుల‌ని క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News