ghmc: స్వచ్ఛ హైదరాబాద్‌లో మెరుగ్గా పనిచేస్తే బంగారం, నగదు నజరానా: జీహెచ్‌ఎంసీ ఆఫర్‌

స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌నే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఓ ఆఫర్‌ను ప్ర‌క‌టించింది. న‌గ‌రంలో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తూ చెత్త‌ను ఏరి పారేయ‌డంలో మెరుగ్గా పనిచేసే కార్మికులతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించే పౌరులకు బంగారం, న‌గ‌దు నజరానాల‌ను అందించాలని నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్తల‌ను వేర్వేరుగా సేకరిస్తూ ప‌నిచేస్తున్న‌ ట్రాలీ కార్మికులకు, చెత్తను బహిరంగ ప్ర‌దేశాల్లో వేయ‌కుండా ఇళ్లలో త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసి చెత్త‌కుండీల్లోనే వేసే గృహిణులకు ఈ న‌జ‌రానాను అందిస్తామ‌ని జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News