revanth reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద మాల మహానాడు నేతల ఆందోళన... ఉద్రిక్తత!

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఇంటి వ‌ద్ద ఈ రోజు మధ్యాహ్నం ఉద్రిక్తత నెల‌కొంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిన్న తెలంగాణ‌ శాస‌న‌స‌భ‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలుపుతూ మాల మహానాడు నేతలు ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు భారీగా త‌ర‌లివ‌చ్చి, ముట్టడించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రేవంత్‌రెడ్డి ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు. మాల‌మ‌హానాడు నేత‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

More Telugu News