cp mahendar reddy: ఈ ఏడాది హైద‌రాబాద్‌లో నేరాలు త‌గ్గాయి: హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ న‌గ‌రంలో ఈ ఏడాది జ‌రిగిన నేరాలు, న‌మోద‌యిన కేసుల‌పై నగర పోలీసు కమీషనర్ మహేందర్‌రెడ్డి వివ‌రాలు తెలిపారు. న‌గ‌రంలో 8 శాతం నేరాలు తగ్గాయని పేర్కొన్నారు. గ‌త ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వేధింపుల కేసులు 18 శాతం, హత్యలు 25 శాతం, తీవ్ర నేరాలు 31 శాతం, మహిళలపై నేరాలు 12 శాతం, చైన్ స్నాచింగ్‌లు 66 శాతం, ఆస్తి సంబంధ నేరాలు 16 శాతం తగ్గాయని ఆయ‌న మీడియాకు వివ‌రించారు. ఈ ఏడాది మొత్తం 23 మందికి జీవితఖైదు శిక్ష పడిందని,  పీడీయాక్ట్ కింద 283 కేసులు నమోదు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News