lal bag park: పార్కులో విషాదం... సెల్ఫీకి ప్రయత్నించి కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు!

బెంగళూరులోని లాల్‌బాగ్‌ పార్కులో విషాదం చోటుచేసుకుంది. త‌ల్లిదండ్రులు త‌మ‌ చిన్నారితో సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నంలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామపురకు చెందిన కుమార్, రేవతి త‌మ‌ ఆరేళ్ల కుమారుడు విక్రమ్‌తో లాల్‌బాగ్‌కు వెళ్లి ఐదడుగుల పొడవైన రాయి మీద ఆ చిన్నారిని కూర్చోబెట్టారు. అనంత‌రం త‌మ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా, ఒక్క‌సారిగా ఆ రాయి కిందపడడంతో దాని మీదున్న విక్ర‌మ్‌ కిందపడ్డాడు. దీంతో ఆ బాలుడికి రాయి త‌గిలి ప్రాణాలు కోల్పోయాడు.

లాల్‌బాగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే త‌మ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడ‌ని, ఆ రాయిని స‌రిగా అమ‌ర్చ‌లేద‌ని ఆ చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.ఆర్‌.చంద్రశేఖర్ మాట్లాడుతూ... ఆ బాలుడిని రాతి స్తంబంపై కూర్చోబెట్టి సెల్ఫీకి ప్ర‌య‌త్నించ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

More Telugu News