kakani: రూ.500 కోట్లకు పైనే నల్లధనాన్ని విదేశాల్లో దాచారు, ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ సోమిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని ఆరోపణలు

టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ప‌లు ఆరోపణ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియ‌తో మాట్లాడుతూ... సోమిరెడ్డి రూ.500 కోట్లకు పైగా నల్లధనాన్ని విదేశాల్లో దాచారని అన్నారు. సోమిరెడ్డి కుటుంబ స‌భ్యుల‌ పేరుతో ప‌లుదేశాల్లో నగదు లావాదేవీలు జ‌రిపార‌ని, సింగపూర్‌, మలేషియా, హాంకాంగ్‌లలో 2001-2014 మధ్య కాలంలో రూ.140 కోట్ల స్థిరాస్తులు కొన్నార‌ని ఆయ‌న ప‌లు ప‌త్రాలు చూపిస్తూ ఆరోపించారు. ఆయా దేశాల్లో ఆయ‌న‌కు ప‌లు భ‌వ‌నాలు ఉన్నాయ‌ని చెప్పారు. సోమిరెడ్డికి సంబంధించిన‌ రూ.350 కోట్ల న‌గ‌దుకు సంబంధించి ప‌లు బ్యాంకుల్లో లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. సోమిరెడ్డి న‌ల్ల‌ధ‌నానికి సంబంధించి ఆధారాల‌ను తీసుకెళ్లి తాను ఈడీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సోమిరెడ్డిపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. సోమిరెడ్డి కొన్నేళ్లుగా జరిపిన నగదు లావాదేవీలను ఐటీ అధికారుల‌కు తెల‌ప‌లేద‌ని కాకాని ఆరోపించారు.

More Telugu News