demonitisation: 45 రోజులు గడిచాయి.. ఇబ్బందులు మాత్రం అలాగే ఉన్నాయి: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకొని 45 రోజులు గడిచినప్పటికీ ప్రజల కష్టాలు అలాగే ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర స‌ర్కారు తీరుకు నిరసన‌గా రాష్ట్ర‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉద‌యం ఛలో వెలగపూడి కార్యక్రమాన్ని నిర్వహించాలని చూశారు. అయితే, దీనికి పోలీసులు అనుమతించ‌లేదు. దీంతో తుళ్లూరు రెవెన్యూ కార్యాలయం వరకు కాంగ్రెస్‌ నేతలు, కార్య‌క‌ర్త‌లు వెళ్లి త‌మ నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... న‌గ‌దు కొర‌త‌తో రైతులు, సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్ప‌టికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి క‌ష్టాల‌ను గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను ప్రభుత్వానికి తెలిపేందుకే తాము వెలగపూడి కార్యక్రమాన్ని చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News