robbery: పోలీసుల పేరుతో ఇంట్లోకి వ‌చ్చారు.. తాళ్ల‌తో క‌ట్టేసి దోచుకున్నారు!

విశాఖప‌ట్నంలో దొంగ‌లు రెచ్చిపోయారు. న‌గ‌రంలోని మ‌ద్దిల‌పాలెం చైతన్య‌న‌గ‌ర్‌లో తాము పోలీసులమ‌ని చెప్పుకుంటూ ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి బీభ‌త్సం సృష్టించారు. స‌దరు ఇంట్లోని కుటుంబ స‌భ్యులంద‌రిని క‌త్తుల‌తో బెదిరించి తాళ్ల‌తో క‌ట్టేశారు. అనంత‌రం ఆ ఇంట్లో డ‌బ్బు, బంగారాన్ని కాజేసి, పారిపోయారు. ఆ ఇంట్లో నుంచి దుండ‌గులు 25 తులాల బంగారం, రూ.51 వేల న‌గ‌దును దోచికెళ్లిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News