vijaya shanthi: కరుణానిధి కూడా ఆసుప‌త్రిలో ఉన్నారు.. మరి ఆయ‌న ఫొటోలను చూపిస్తున్నారా?: విజ‌య‌శాంతి

త‌మిళ‌నాడు దివంగత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు ఆమె ఫొటోల‌ను ఎందుకు విడుద‌ల చేయ‌లేద‌ని, ఆమెను కుట్రపూరితంగా చంపేశార‌ని సినీన‌టి గౌత‌మి, త‌మిళ‌నాడు నాయ‌కురాలు శ‌శిక‌ళ పుష్ప చేసిన ఆరోప‌ణ‌ల‌పై విజ‌య‌శాంతి స్పందించారు. ఒక ఆడ‌మ‌నిషి అయిన‌ జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న‌ప్పుడు ఆ స్థితిలో ఫొటోలు తీసి ఎలా విడుదల చేస్తార‌ని ప్ర‌శ్నించారు.
 జ‌య‌ మృతి వెనుక కుట్ర దాగుంద‌ని ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా జ‌య‌ల‌లిత క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు రాలేదని, కానీ ఇప్పుడు వ‌స్తున్నారని అన్నారు. ఇప్పుడు వ‌చ్చి కొత్తగా మాట్లాడుతుండ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని అన్నారు. కరుణానిధి కూడా జయలలిత ఫొటోలను విడుదల చేయాలని అన్నారని ఆమె అన్నారు. ఇప్పుడు కరుణానిధి ఆసుప‌త్రిలో ఉన్నారని, మ‌రి ఆయ‌న ఫొటోలను విడుద‌ల చేస్తున్నారా? అని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు. కొందరి ఫొటోలను విడుదల చేయడం కుదరదని ఆమె చెప్పారు.

More Telugu News