mahesh tweet on ok janu: మహేశ్ బాబు ట్వీట్ కి శ్రద్ధా కపూర్ బుగ్గలు ఎర్రబారాయి!

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ కి బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బుగ్గలు ఎర్రబారాయి. శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్ కపూర్ జంటగా నటించిన 'ఓకే జాను' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శ్రద్ధ, ఆదిత్యారాయ్ కపూర్ ల కెమిస్ట్రీ బాగా పండింది. 'ఆషికి 2' సినిమాతో బాలీవుడ్ క్రేజీ పెయిర్ గా, మాజీ ప్రేమికులుగా పేరుతెచ్చుకున్న వీరిద్దరూ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి తోడు గతంలో మణిరత్నం తీసిన 'ఓకే బంగారం' సినిమాకు రీమేక్ వెర్షన్ కావడంతో దీనిని దర్శకుడు ఎలా తెరకెక్కించాడా? అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందని, ఈ చిత్రం కెమెరామేన్ రవి కె చంద్రన్ పనితనం బాగుందని కితాబునిస్తూ, ఆల్ ది బెస్టె చెప్పాడు. దీనికి ఆయన మహేశ్ బాబుకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ ట్వీట్ చూసిన శ్రధ్ధా కపూర్ ఎమోజీలతో తన మనోభావాలు వెల్లడించింది. బుగ్గలు ఎర్రబారాయని, చాలా ఆనందంగా ఉందని, గాల్లో తేలియాడుతున్నట్టు ఉందిని, లాట్స్ ఆఫ్ లవ్ అని తెలిపింది.  

More Telugu News