army firing: భార‌త సైన్యం చేతిలో ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది అబు బ‌క‌ర్ హ‌తం

జ‌మ్ముక‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డార‌ని తెలుసుకున్న భార‌త‌ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఈ రోజు ఉద‌యం నుంచి విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో సోపోర్‌లో ఓ చోటదాగి ఉన్న ల‌ష్క‌రే తోయిబా క‌మాండ‌ర్ అబు బ‌క‌ర్ భ‌ద్రతా బ‌ల‌గాల‌పై కాల్పులు జ‌రిపాడు. దీంతో ఎదురు కాల్పులు జ‌రిపిన భద్ర‌తా బ‌ల‌గాలు ఉగ్ర‌వాదిని మ‌ట్టుబెట్టాయి. మ‌రోవైపు బిజ్బెర్హా ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర‌వాది ఒక‌రు హ‌తమ‌య్యాడు. ఈ ఉగ్ర‌వాది నుంచి ప‌లు ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

More Telugu News