: ‘జీ’ గ్రూప్ తో రిలయన్స్ భారీ ఒప్పందం

‘జీ’ గ్రూప్ తో ‘రిలయన్స్’ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ గ్రూప్ నకు చెందిన టెలివిజన్ ఛానెళ్లను ‘జీ’ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం మొత్తం విలువ రూ.1,900 కోట్లు అని రిలయన్స్ క్యాపిటల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా రేడియో వ్యాపారంలో 49 శాతం వాటాను జీ మీడియా కార్పొరేషన్ కు బదిలీ చేసింది. రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినా ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు వచ్చే ఏడాదిలో పూర్తవుతాయని రిలయన్స్ క్యాపిటల్ ఆ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News