: రూ. 2 చెల్లించి నెలంతా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు!: బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ కంపెనీ ఇవ్వలేని ఆఫర్!

కనెక్షన్ తీసుకుంటే చాలు... అద్దె లేకుండా ఉచితంగా మాట్లాడుకోండనేలా ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ మరే టెలికం కంపెనీ ఇవ్వలేని ఆఫర్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే రిలయన్స్ జియోకు సైతం షాకిస్తూ, రూ. 249కి అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు దిమ్మతిరిగే ఆఫర్ తేనున్నట్టు సమాచారం. ప్రీపెయిడ్ కస్టమర్లు వాడుకునేలా 2జీ, 3జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా ఇవ్వాలని దీనికి అద్దె అత్యంత నామమాత్రంగా రూ. 2 నుంచి రూ. 4 మాత్రమే ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా, 2జీ, 3జీ వినియోగదారులు ఉచిత కాల్స్ ను ఏ నెట్ వర్క్ కైనా చేసుకోవచ్చని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలి దశలో సంస్థ నెట్ వర్క్ మెరుగ్గా ఉండే హిమాచల్ ప్రదశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిసా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ను తీసుకువస్తామని, ఆపై దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు. జియో ఆఫర్లు 4జీ సపోర్ట్ చేసే ఫోన్లపైనే పనిచేస్తాయి. బీఎస్ఎన్ఎల్ తన తాజా ఆఫర్ ను అమలు చేస్తే, ఇండియాలోని ఏ మొబైల్ ఫోన్ నుంచైనా బీఎస్ఎన్ఎల్ సిమ్ తో ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. కాగా, ఈ అతి తక్కువ చార్జ్ ఆఫర్, మరో ఇంటర్నెట్ ప్యాక్ తో బండిల్డ్ రూపంలో రావచ్చని టెలికం నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News